జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం
వాణిజ్యపరంగా ఇస్రో మరో ముందడుగు • కక్ష్యలోకి వన్వెబ్కు చెందిన 36 ఉపగ్రహాలు
శ్రీహరికోట, న్యూస్ టుడే: అర్ధరాత్రి వేళ నిప్పులు చిమ్ముతూ జీఎస్ఎల్వీ మార్క్ వాహకనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని రాకెట్ కేంద్రం నుంచి 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన ఇస్రో.. మరోమారు తన సత్తా చాటింది. శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైన కౌంట్ డౌన్ 24 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన తర్వాత.. షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఆదివారం 00.07 గంట లకు జీఎస్ఎల్వీ వాహకనౌక నింగి సుమారు ఆరు టన్నుల బరువుగల విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. న్యూస్పేస్ ఇండియా లిమి టెడ్ (ఎన్ఎస్ఐఎల్)తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వన్వెబు చెందిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లోకి దశలవారీగా ప్రవేశ పెట్టింది. ఒక్కో ఉపగ్రహం బరువు 142 కిలోల వరకు ఉంది. కక్ష్యలోకి వెళ్లిన ఉప గ్రహాలను యూకేకు చెందిన గ్రౌండ్ స్టేషన్ నుంచి నియంత్రించనున్నారు. ఇస్రో అధిపతి డా. సోమనాథ్ షార్లోనే ఉంటూ కౌంట్ డౌన్లో పాల్గొని వాహకనౌక ఏర్పాట్లను పరిశీలించారు. అమెరికా, ఫ్రాన్సు, యూకేకు చెందిన 14 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
లోకి దూసుకెళ్లింది. ఇస్రో మొదటిసా నిప్పులు చిమ్ముతూ నింగిలోకి రిగా జీఎస్ఎల్వీ వాహకనౌక ద్వారా దూసుకెళ్తున్న జీఎస్ఎల్వీ మార్క్ 3